ఇన్వెస్టర్లకు ఎంత కష్టం

ABN , First Publish Date - 2022-03-05T09:20:11+05:30 IST

ఉక్రెయిన్‌, రష్యా పరిణామాల నేపథ్యంలో గత మూడు వారాలుగా ఈక్విటీ మార్కెట్లు భారీ స్థాయిలో ఊగిసలాడుతూ ఇన్వెస్టర్లకు అనూహ్యమైన నష్టాన్ని కలిగించాయి.

ఇన్వెస్టర్లకు ఎంత కష్టం

18 రోజుల్లో రూ.15 లక్షల కోట్ల నష్టం

కోల్పోయింది ఉక్రెయిన్‌ జీడీపీ కన్నా ఎక్కువే

ముంబై : ఉక్రెయిన్‌, రష్యా పరిణామాల నేపథ్యంలో గత మూడు వారాలుగా ఈక్విటీ మార్కెట్లు భారీ స్థాయిలో ఊగిసలాడుతూ ఇన్వెస్టర్లకు అనూహ్యమైన నష్టాన్ని కలిగించాయి. ఏ రోజుకారోజు మార్కెట్‌ సంపద కర్పూరంలా కరిగిపోతోంది. గత నెల 15వ తేదీ నుంచి నేటి వరకు ఈక్విటీ మార్కెట్లో ఇన్వెస్టర్లు నష్టపోయింది సాక్షాత్తు రూ.15 లక్షల కోట్లు.  ఇది 2021లో ఉక్రెయిన్‌ జీడీపీ కన్నా ఎక్కువని అం చనా. కాగా శుక్రవారం సెన్సెక్స్‌ 768.87 పాయింట్లు నష్టపోయి 54,338.81 వ ద్ద ముగిసింది. నిఫ్టీ 252.70 పాయింట్లు నష్టంతో 16,245.35వద్ద ముగిసింది. 

Updated Date - 2022-03-05T09:20:11+05:30 IST