DHL Express: రిటైల్ వినియోగదారుల కోసం ‘రక్షాబంధన్’ ఆఫర్ ప్రకటించిన డీహెచ్ఎల్ ఎక్స్ప్రెస్
ABN , First Publish Date - 2022-08-04T23:42:09+05:30 IST
అంతర్జాతీయ లాజిస్టిక్ కంపెనీ డీహెచ్ఎల్ ఎక్స్ప్రెస్ రక్షబంధన్ను పురస్కరించుకుని రిటైల్ వినియోగదారులకు సరికొత్త
ముంబై: అంతర్జాతీయ లాజిస్టిక్ కంపెనీ డీహెచ్ఎల్ ఎక్స్ప్రెస్ రక్షబంధన్ను పురస్కరించుకుని రిటైల్ వినియోగదారులకు సరికొత్త ఆఫర్ ప్రకటించింది. ఈ ఆఫర్ ద్వారా రాఖీలు, బహుమతులను కుటుంబాలకు మరింత దగ్గరగా తీసుకురానుంది. రాఖీ పండుగ ఆఫర్లో భాగంగా డీహెచ్ఎల్ రిటైల్ వినియోగదారులు అంతర్జాతీయ రాఖీలు, గిఫ్ట్ పేమెంట్స్పై ఈ నెల 13వ తేదీ వరకు 50 శాతం రాయితీ పొందొచ్చు.
ఈ రాయితీ భారతదేశ వ్యాప్తంగా 650కు పైగా రిటైల్ స్టోర్ల వద్ద అందుబాటులో ఉంటుంది. ఈ షిప్మెంట్స్ బరువు అరకేజీ నుంచి రెండున్న కేజీలు. అలాగే 5కేజీలు, 10కేజీలు, 20కేజీల బరువు వరకూ ఉండొచ్చు. వినియోగదారులు ఈ ప్రత్యేక డీల్స్ను స్వీట్లు, ఎంపిక చేసిన బహుమతులు, ఇంటిలో తయారుచేసిన స్వీట్లు సహా మరెన్నింటినో విదేశాల్లో ఉండే మన ప్రియమైన వారికి పంపొచ్చు.
ఈ ప్రత్యేకమైన ఆఫర్లను అత్యంత శుభప్రదమైన రక్షాబంధన్ కోసం ప్రత్యేకంగా తీర్చిదిద్దినట్టు డీహెచ్ఎల్ సేల్స్ అండ్ మార్కెటింగ్ వైస్ ప్రెసిడెంట్ సందీప్ జునేజా పేర్కొన్నారు. వినియోగదారులు 220 దేశాలలో ఉన్నటువంటి డీహెచ్ఎల్ అంతర్జాతీయ నెట్వర్క్పై ఆధారపడి తమ కుటుంబ సభ్యులు, స్నేహితులకు శుభాకాంక్షలను అందజేయవచ్చు.
ఈ ఆఫర్, పూర్తిస్థాయి షిప్మెంట్ విజిబిలిటీతో వస్తోంది. ప్రపంచవ్యాప్తంగా అన్ని ప్రదేశాలకూ సౌకర్యవంతంగా డెలివరీ చేయబడుతుందనేందుకు భరోసా అందిస్తూ ఎస్ఎంఎస్, ఈ–మెయిల్ అప్డేట్స్ షిప్మెంట్ సమయమంతటా వస్తాయి. ఈ ఆఫర్ గురించి మరింతగా తెలుసుకునేందుకు వినియోగదారులు డీహెచ్ఎల్ ఎక్స్ప్రెస్ టోల్ ఫ్రీ నెంబర్ 1800 11 1345 కు కాల్ చేయవచ్చు.