టీబీని గుర్తించే దేశీ కిట్‌: మైల్యాబ్‌

ABN , First Publish Date - 2022-12-06T01:01:52+05:30 IST

టీబీ వ్యాధిని గుర్తించడానికి తొలిసారిగా దేశీయంగా అభివృద్ధి చేసిన కిట్‌ను మైల్యాబ్‌ అందుబాటులోకి తీసుకురానుంది...

టీబీని గుర్తించే దేశీ కిట్‌: మైల్యాబ్‌

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): టీబీ వ్యాధిని గుర్తించడానికి తొలిసారిగా దేశీయంగా అభివృద్ధి చేసిన కిట్‌ను మైల్యాబ్‌ అందుబాటులోకి తీసుకురానుంది. ‘ప్యాథోడిటెక్ట్‌ ఎంటీబీ ఆర్‌ఐఎఫ్‌ అండ్‌ ఐఎన్‌హెచ్‌ డ్రగ్‌ రెసిస్టాన్స్‌’ కిట్‌కు సీడీఎ్‌ససీఓ టీబీ నిపుణుల కమిటీ, ఐసీఎంఆర్‌ అనుమతి లభించిందని మైల్యాబ్‌ వెల్లడించింది. ఈ కిట్‌ టీబీ ఔషధాలకు సంబంధించిన డ్రగ్‌ రెసిస్టెన్స్‌ను కూడా గుర్తిస్తుంది. భారత టీబీ టెస్టింగ్‌లో ఇది ఒక మైలురాయి అని మైల్యాబ్‌ ఎండీ హస్ముఖ్‌ రావల్‌ తెలిపారు. 2021లో దేశంలో 19.3 లక్షల కొత్త టీబీ రోగులను గుర్తించారు. 2020లో గుర్తించిన రోగులతో పోలిస్తే ఇది 19 శాతం అధికమని కంపెనీ పేర్కొంది. 2020లో టీబీ కారణంగా 4.93 లక్షల మంది మరణించారు.

Updated Date - 2022-12-06T01:02:45+05:30 IST