ఉక్రెయిన్‌పై రష్యా యుద్దం...వంద డాలర్లకు పెరిగిన క్రూడాయిల్ ధర

ABN , First Publish Date - 2022-02-24T16:24:30+05:30 IST

ఉక్రెయిన్ దేశంపై రష్యా యుద్ధం ప్రారంభించడంతో గురువారం ప్రపంచ మార్కెట్‌లో క్రూడాయిల్ ధర బ్యారెల్ 100 డాలర్లకు చేరింది.

ఉక్రెయిన్‌పై రష్యా యుద్దం...వంద డాలర్లకు పెరిగిన క్రూడాయిల్ ధర

న్యూఢిల్లీ: ఉక్రెయిన్ దేశంపై రష్యా యుద్ధం ప్రారంభించడంతో గురువారం ప్రపంచ మార్కెట్‌లో క్రూడాయిల్ ధర బ్యారెల్ 100 డాలర్లకు చేరింది. గడచిన ఏడేళ్లలో తొలిసారిగా అంతర్జాతీయ మార్కెటులో ముడి చమురు బ్యారెల్ ధర 100 డాలర్ల మార్కును తాకింది.రష్యా-ఉక్రెయిన్ యుద్ధం వల్ల 2014వ సంవత్సరం తర్వాత తొలిసారిగా చమురు ధరలు బ్యారెల్‌కు 100 డాలర్లకు చేరాయి.2014వ సంవత్సరంలో ముడిచమురు బ్యారెల్ ధర 100 డాలర్లను అధిగమించింది.ఈ యుద్ధం వల్ల ఇంధనంతోపాటు గోధుమలు, లోహాల ధరలు పెరగనున్నాయి.ఇటీవల కరోనా లాక్ డౌన్ల తర్వాత సంక్షోభం నెలకొంది.ఈ యుద్ధం ప్రపంచ ఇంధన సరఫరాలకు అంతరాయం కలిగిస్తుందనే ఆందోళన రేకెత్తిస్తోంది.రష్యా ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద చమురు ఉత్పత్తిదారు. ఇది ప్రధానంగా యూరోపియన్ రిఫైనరీలకు ముడి చమురును విక్రయిస్తుంది.  


Updated Date - 2022-02-24T16:24:30+05:30 IST