అవాంఛిత కాల్స్, మెసేజ్లకు చెక్!
ABN , First Publish Date - 2022-11-29T03:01:00+05:30 IST
అవాంఛిత కాల్స్, మెసేజ్లను గుర్తించేందుకు పలు టెక్నాలజీల అభివృద్ధికి కృషి చేస్తున్నట్లు టెలికాం నియంత్రణ మండలి ‘ట్రాయ్’ వెల్లడించింది...
వాటిని గుర్తించే టెక్నాలజీ అభివృద్ధికి కృషి
ఆర్థిక మోసాలను అరికట్టేందుకు ఉమ్మడి కార్యాచరణ ప్రణాళిక: ట్రాయ్
న్యూఢిల్లీ: అవాంఛిత కాల్స్, మెసేజ్లను గుర్తించేందుకు పలు టెక్నాలజీల అభివృద్ధికి కృషి చేస్తున్నట్లు టెలికాం నియంత్రణ మండలి ‘ట్రాయ్’ వెల్లడించింది. అంతేకాదు, ఆర్థిక మోసాలను అరికట్టేందుకు ఉమ్మడి కార్యాచరణ ప్రణాళికను రూపొందిస్తున్నట్లు తెలిపింది. అవాంఛిత వాణిజ్య సమాచారం (యూసీసీ) మొబైల్ వినియోగదారులకు అత్యంత ఇబ్బందికరమైన అంశంగా మారిందని, వ్యక్తిగత గోప్యతను దెబ్బతీస్తున్నదని అంటోంది. ‘‘అన్ రిజిస్టర్డ్ టెలిమార్కెటర్స్ (యూటీఎం)పై ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. యూసీసీ ఎస్ఎంఎ్సలతో పాటు కాల్స్నూ అరికట్టాల్సిన అవసరం ఉంద’’ని ట్రాయ్ పేర్కొంది. యూటీఎంల అవాంఛిత సమాచారానికి చెక్ పెట్టేందుకు సంబంధిత వర్గాల సహకారంతో అవసరమైన చర్యలు చేపడుతోంది.