జీన్పవరెక్స్తో ఆంకోడాట్కామ్ జట్టు
ABN , First Publish Date - 2022-08-28T07:04:54+05:30 IST
భారత్లో క్యాన్సర్ వ్యాధిగ్రస్తుల కోసం ప్రపంచస్థాయి అడ్వాన్స్డ్ జీన్ సీక్వెన్సింగ్ టెక్నాలజీని అందుబాటులోకి తీసుకువచ్చేందుకు జీన్పవరెక్స్, ఆంకో డాట్కామ్ జట్టు కట్టాయి.

భారత్లో క్యాన్సర్ వ్యాధిగ్రస్తుల కోసం ప్రపంచస్థాయి అడ్వాన్స్డ్ జీన్ సీక్వెన్సింగ్ టెక్నాలజీని అందుబాటులోకి తీసుకువచ్చేందుకు జీన్పవరెక్స్, ఆంకో డాట్కామ్ జట్టు కట్టాయి. ఈ మేరకు జీన్పవరెక్స్ వ్యవస్థాపకులు డాక్టర్ కళ్యాణ్, డాక్టర్ హిమ.. క్యాన్సర్ కేర్ మేనేజ్మెంట్ ప్లాట్ఫామ్ ఆంకోడాట్ కామ్తో భాగస్వామ్య ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు. జీన్పవరెక్స్.. దేశంలోనే తొలి సమగ్ర క్యాన్సర్ జెనెటిక్ పరీక్ష.. ఆంకోఆర్ఎక్స్ అభివృద్ధి చేసింది. టార్గెటెడ్ థెరపీ ఔషధాలను ఆంకాలజిస్ట్స్ ప్రిస్ర్కైబ్ చేసేందుకు ఇది దోహదం చేస్తుంది. ఆర్టిఫీషియల్ ఇంటలిజెన్స్ (ఏఐ) ఆల్గారిథమ్స్ను ఉపయోగించటం ద్వారా ఈ పరీక్షను చేస్తారు. ఈ జెనెటిక్ పరీక్షను అందుబాటు ధరల్లో తీసుకువచ్చేందుకు ఈ ఒప్పందం దోహపడనుంది. కాగా ఆంకో డాట్కామ్.. దేశవ్యాప్తంగా 1,500కు పైగా ఆంకాలజిస్ట్స్, 500కు పైగా హాస్పిటల్స్తో పాటు ఆంకో క్యాన్సర్ సెంటర్లతో క్యాన్సర్ వ్యాధిగ్రస్తులకు సేవలందిస్తోంది. అలాగే అడ్వాన్స్డ్ క్యాన్సర్ జినోమిక్స్ పరీక్షలు, టార్గెటెడ్ థెరపీలో కచ్చితమైన సిఫారసులను చేస్తోంది.