ప్రారంభమైన అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ డే సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ ఆఫర్లు
ABN , First Publish Date - 2022-01-17T01:02:13+05:30 IST
అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ సేల్ 2022 ప్రైమ్ సభ్యులకు లైవ్లోకి వచ్చేసింది. ఈ అర్ధరాత్రి తర్వాతి నుంచి ..
న్యూఢిల్లీ: అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ సేల్ 2022 ప్రైమ్ సభ్యులకు లైవ్లోకి వచ్చేసింది. ఈ అర్ధరాత్రి తర్వాతి నుంచి అందరికీ ఈ సేల్ అందుబాటులోకి వస్తుంది. ఈ నెల 20 వరకు కొనసాగుతుంది. మొబైల్ ఫోన్లు, ల్యాప్టాప్లు, టీవీలు, ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులపై భారీ ఆఫర్లు ప్రకటించింది. అలాగే, బండిల్డ్, ఎక్స్చేంజ్ ఆఫర్లు కూడా ఉన్నాయి.
స్మార్ట్ఫోన్ల విషయానికి వస్తే వన్ప్లస్ 9 ప్రొ 5జీ ప్రస్తుత ధర రూ. 64,999 కాగా, ఇప్పుడు దానిని 55,999కే అందుబాటులోకి తీసుకొచ్చింది. ఎస్బీఐ క్రెడిట్ కార్డును ఉపయోగించి కొనుగోలు చేసే వినియోగదారులకు అదనంగా రూ. 5వేల రాయితీ లభించనుంది. పాత స్మార్ట్ఫోన్ను ఎక్స్చేంజ్ కొనుగోలు చేస్తే అదనంగా మరో రూ. 5 వేలు డిస్కౌంట్ లభిస్తుంది.
వీటితోపాటు నో కాస్ట్ ఈఎంఐ పేమెంట్ ఆప్షన్లు, బండిల్డ్ ఎక్స్చేంజ్పై రూ. 19,900 వరకు ఆఫర్ ప్రకటించింది. రియల్మి నర్జో 50ఎ అసలు ధర రూ. 13,990 కాగా, దానిని రూ. 11,499కు, షియోమీ 11 లైట్ను ఎన్ఈ 5జీని రూ. 25,999కి అందుబాటులోకి తీసుకొచ్చింది.
అమెజాన్ కిండల్ 10వ జనరేషన్ను ధరను రూ. 1000 తగ్గించి రూ. 6,799కు అందుబాటులో ఉంచగా, అమెజాన్ ఫైర్ టీవీ స్టిక్ 4కే ధరను ఏకంగా రూ. 2,500 తగ్గించి రూ. 3,499కి లిస్ట్ చేసింది. రెడ్మి 50 అంగుళాల 4కె అల్ట్రా హెచ్డీ ఆండ్రాయిడ్ స్మార్ట్ ఎల్ఈడీ టీవీ ధర రూ. 44,999 కాగా, దానిని రూ. 30,001కు తగ్గించింది. శాంసంగ్ ది సెరీఫ్ సిరీస్ 55 అంగుళాల క్యూలెడ్ టీవీ ధరను భారీగా తగ్గించింది. దీని ఎమ్మార్పీ రూ. 1,63,900 కాగా, ఇప్పుడు దీనిని రూ. 79,990కి అందుబాటులోకి తీసుకొచ్చింది.