భీమవరంలో డ్రగ్స్ కలకలం.. ముగ్గురి అరెస్ట్

ABN , First Publish Date - 2022-01-24T04:01:39+05:30 IST

భీమవరంలో డ్రగ్స్ కలకలం రేగింది. డ్రగ్స్‌ ఉన్నాయన్న సమాచారంతో ఎస్ఈబీ అధికారులు తనిఖీలు చేశారు. ముగ్గురు యువకులను...

భీమవరంలో డ్రగ్స్ కలకలం.. ముగ్గురి అరెస్ట్

ఏలూరు: భీమవరంలో డ్రగ్స్ కలకలం రేగింది. డ్రగ్స్‌ ఉన్నాయన్న సమాచారంతో ఎస్ఈబీ అధికారులు తనిఖీలు చేశారు. ముగ్గురు యువకులను అరెస్ట్ చేశారు. భీమవరం యువకుడు రోహిత్‌ నుంచి 8 ఎల్ఎస్డీ స్టాంప్స్ స్వాధీనం చేసుకున్నారు. పాలకోడేరు మండలం వేండ్రకు చెందిన యువకుడు రాజాఉపేంద్ర నుంచి 100గ్రాముల గంజాయి, కారు స్వాధీనం చేసుకున్నారు. రిత్విక్ నుంచి 5 ఎల్ఎస్డీ స్టాంప్స్, 1గ్రామ్ ఎండీఎంఏ, 5 ఎక్ట్సాసీ టాబ్లెట్లు, 20 గ్రాముల గంజాయి గుర్తించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 


Updated Date - 2022-01-24T04:01:39+05:30 IST