16 మందికి ఎల్లో ఫీవర్‌ వ్యాక్సిన్‌

ABN , First Publish Date - 2022-12-31T05:51:18+05:30 IST

ఎల్లో ఫీవర్‌ వ్యాక్సినేషన్‌ కోసం విజయవాడలో ఏర్పాటు చేసిన అంతర్జాతీయ వ్యాక్సినేషన్‌ సెంటర్‌కు మంచి స్పందన వస్తోందని ఆరోగ్యశాఖ డైరెక్టర్‌ జె.నివాస్‌ ఒక ప్రకటనలో తెలిపారు.

16 మందికి ఎల్లో ఫీవర్‌ వ్యాక్సిన్‌

ఆరోగ్యశాఖ డైరెక్టర్‌ నివాస్‌ వెల్లడి

అమరావతి, డిసెంబరు 30 (ఆంధ్రజ్యోతి): ఎల్లో ఫీవర్‌ వ్యాక్సినేషన్‌ కోసం విజయవాడలో ఏర్పాటు చేసిన అంతర్జాతీయ వ్యాక్సినేషన్‌ సెంటర్‌కు మంచి స్పందన వస్తోందని ఆరోగ్యశాఖ డైరెక్టర్‌ జె.నివాస్‌ ఒక ప్రకటనలో తెలిపారు. ఇప్పటి వరకూ 16 మంది వ్యాక్సిన్‌ తీసుకున్నారని పేర్కొన్నారు. విదేశాలకు వెళ్లే పర్యాటకులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకుని, ఇచ్చిన సమయానికి వెళ్లి వ్యాక్సిన్‌ వేయించుకోవచ్చని సూచించారు. ప్రతి వ్యాక్సినేషన్‌ కోసం రూ.500 చెల్లించాల్సి ఉంటుందని చెప్పారు.

Updated Date - 2022-12-31T05:51:19+05:30 IST