పాయకరావుపేట వైసీపీలో పేచీ
ABN , First Publish Date - 2022-04-14T00:31:02+05:30 IST
విశాఖపట్నం జిల్లా పాయకరావుపేట నియోజకవర్గ వైసీపీలో ఉన్న పేచీ అమరావతికి చేరింది. ఎమ్మెల్యే గొల్ల బాబూరావుకు మద్దతుగా
విజయవాడ: విశాఖపట్నం జిల్లా పాయకరావుపేట నియోజకవర్గ వైసీపీలో ఉన్న పేచీ అమరావతికి చేరింది. ఎమ్మెల్యే గొల్ల బాబూరావుకు మద్దతుగా 200 మంది నాయకులు, కార్యకర్తలు ప్రత్యేక వాహనాల్లో బుధవారం ఇక్కడికి చేరుకున్నారు. తొలుత ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డితో భేటీ అయ్యారు. అనంతరం ఉండవల్లిలోని గొల్ల బాబూరావు నివాసంలో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. నియోజకవర్గంలో పార్టీకి సమన్వయకర్తలుగా ఉన్న చిక్కాల రామారావు, బొలిశెట్టి గోవిందరావు, వీసం రామకృష్ణ, సూర్యనారాయణరాజుపై నాయకులు, కార్యకర్తలు భగ్గుమన్నారు. ఆ నలుగురిపై సజ్జలకు ఫిర్యాదు చేశారు. వివిధ సామాజికవర్గాలకు చెందిన వారు దళిత వర్గానికి చెందిన ఎమ్మెల్యే బాబూరావును రాజకీయంగా ఇబ్బందులు పెడుతున్నారని చెప్పినట్టు సమాచారం. సజ్జలతో గంటసేపు సమావేశం నిర్వహించిన అనంతరం, తిరిగి బాబూరావు నివాసంలో మరో సమావేశం నిర్వహించుకున్నారు. నియోజకవర్గంలో వర్గపోరును సృష్టిస్తున్న వారిని పార్టీలో కొంతమంది పెద్దలు ప్రోత్సహిస్తున్నారని కార్యకర్తలు మండిపడ్డారు.