YCPపై పవన్ అభాండాలు వేస్తున్నారు: కాకాని
ABN , First Publish Date - 2022-07-13T21:23:24+05:30 IST
వైసీపీ (YCP)పై జనసేన అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan) అభాండాలు వేస్తున్నారని మంత్రి కాకాని గోవర్ధన్రెడ్డి(Kakani Govardhan Reddy) ధ్వజమెత్తారు.
అమరావతి: వైసీపీ (YCP)పై జనసేన అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan) అభాండాలు వేస్తున్నారని మంత్రి కాకాని గోవర్ధన్రెడ్డి(Kakani Govardhan Reddy) ధ్వజమెత్తారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ సీసీఆర్సీ సర్టిఫికేట్, పాస్బుక్ ఉన్నా ఏ రైతుకైనా.. నష్ట పరిహారం ఇవ్వలేదని నిరూపిస్తారా? అని ప్రశ్నించారు. కంది పంటను కూడా గుర్తుపట్టలేని టీడీపీ నేత లోకేష్ (Lokesh), సీఎం జగన్కు లేఖలు రాస్తున్నారని ఎద్దేవాచేశారు. పంటలు దెబ్బతిన్న చోట 80శాతం సబ్సిడీతో విత్తనాలు అందిస్తామని ప్రకటించారు. సీజన్ ముగిసే లోపు ఇన్పుట్ సబ్సిడీ అందజేస్తామని కాకాని గోవర్ధన్రెడ్డి తెలిపారు.