AP: జంగారెడ్డిగూడెంలో భారీగా పోలీసుల మోహరింపు
ABN , First Publish Date - 2022-03-14T15:17:31+05:30 IST
పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం ఏజెన్సీ పరిసర ప్రాంతాల్లో భారీగా పోలీసు బలగాలు మోహరించారు.
ఏలూరు: పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం ఏజెన్సీ పరిసర ప్రాంతాల్లో భారీగా పోలీసు బలగాలు మోహరించారు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన నేపథ్యంలో అధికారులు, పోలీసులు అప్రమత్తమయ్యారు. ఇప్పటికే బాధిత కుటుంబాలను వైసీపీ నాయకులు ఏలూరుకు తరలించారు. జీలిగుమీల్లి మండలం దర్భగుడెం , బుట్టాయిగుడేం మండలం బూసరాజు పల్లి , రామారావు పేట సెంటర్లలో పోలీస్ పికేట్ ఏర్పాటు చేశారు. జంగారెడ్డిగూడెం పరిసర ప్రాంతాల్లో కూడా పోలీస్ పీకెట్ ఏర్పాటు చేశారు. ఎక్కడిక్కడ టీడీపీ నాయకులని, కార్యకర్తలను పోలీసులు అడ్డుకుంటున్నారు.