Visakha: బాక్సింగ్ ఆడిన మంత్రి రోజా

ABN , First Publish Date - 2022-12-19T14:52:49+05:30 IST

విశాఖ: నగరంలో సీఎం బాక్సింగ్ (Boxing) నేషనల్ ఛాంపియన్‌షిప్‌ను మంత్రి రోజా (Minister Roja) ప్రారంభించారు.

Visakha: బాక్సింగ్ ఆడిన మంత్రి రోజా

విశాఖ: నగరంలో సీఎం బాక్సింగ్ (Boxing) నేషనల్ ఛాంపియన్‌షిప్‌ను మంత్రి రోజా (Minister Roja) ప్రారంభించారు. 14 రాష్ట్రాల నుంచి 4 వందల మంది ఈ పోటీలలో పాల్గొంటున్నారని, గత ఏడాది రాష్ట్ర స్థాయిలో బాక్సింగ్ పోటీలను అద్భుతంగా నిర్వహించామన్నారు. ఈ ఏడాది జాతీయ స్థాయిలో నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు. ఈ సందర్భంగా మంత్రి రోజా బాక్సింగ్ ఆడారు.

అలాగే రాష్ట్రంలో నాలుగు జోన్లలో జగనన్న స్వర్ణోత్సవ సాంస్కృతిక సంబరాలు నిర్వహించామని మంత్రి రోజా తెలిపారు. నాలుగు జోన్లలో ప్రతిభ కనబర్చిన వారికి ఫైనల్స్ నిర్వహిస్తున్నామని... ఎంత టాలెంట్ ఉన్నా ప్రోత్సాహం, గుర్తింపు ఉండాలని అన్నారు. కళాకారుల్లో ఉన్న ప్రతిభను వెలికితీసేందుకే జగనన్న స్వర్ణోత్సవ సాంస్కృతిక సంబరాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. తాను కూడా కళాకారుల కుటుంబ సభ్యురాలినే అని అన్నారు. మన కళలను భవిష్యత్ తరాలకు అందించాలన్నదే ప్రభుత్వ ప్రయత్నమని తెలియజేశారు. నాలుగు జోన్లలో నిర్వహించిన సాంస్కృతిక సంబరాల్లో ఎంతో మంది కళాకారులను గుర్తించామన్నారు. ‘‘ఏపీ కళాకారులంటే ఆషా మాషీ కాదు... అద్భుతమైన టాలెంట్ ఉన్నవారని అందరికీ తెలిసిందే’’ అని మంత్రి రోజా వ్యాఖ్యానించారు.

Updated Date - 2022-12-19T15:03:54+05:30 IST