Ganta Srinivasa Rao: అలాంటి పరిస్థితి వస్తే.. చెప్పే చేస్తాను..

ABN , First Publish Date - 2022-12-12T12:45:49+05:30 IST

విశాఖ: నగరంలో ఈనెల 26వ తేదీన నిర్వహించే కాపునాడు బహిరంగ సభ పోషణ పోస్టర్‌ను మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు (Ganta Srinivasa Rao) ఆవిష్కరించారు.

Ganta Srinivasa Rao: అలాంటి పరిస్థితి వస్తే.. చెప్పే చేస్తాను..

విశాఖ: నగరంలో ఈనెల 26వ తేదీన నిర్వహించనున్న కాపునాడు బహిరంగ సభ పోషణ పోస్టర్‌ను మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు (Ganta Srinivasa Rao) సోమవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ కార్యక్రమం రాధా, రంగా, రాయల్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో జరుగుతుందన్నారు. కాపుల అభివృద్ధి కోసం, ఏ కార్యక్రమం పెట్టిన ముందు ఉంటానన్నారు. పోస్టర్ ఆవిష్కరణను సంస్థ నిర్వాహకులు చిరంజీవితో ప్రారంభించాలని ఆలోచన చేశారని, ఆయన అందుబాటులో లేకపోవడం వల్ల, తాను పోస్టర్ లాంచింగ్ చేశానన్నారు. తన పార్టీ మార్పుపై ప్రతిసారి మీడియానే తేదీ, సమయాలను ప్రకటించేస్తున్నాయని అన్నారు. తాను ఏ రోజు ప్రకటించలేదన్నారు. నిజంగా అలాంటి పరిస్థితి వస్తే... తానే చెబుతానని.. చెప్పే చేస్తానని గంటా శ్రీనివాసరావు స్పష్టం చేశారు. కాగా ఈ కార్యక్రమానికి కాపు సంఘాల నేతలు హాజరయ్యారు.

Updated Date - 2022-12-12T12:45:53+05:30 IST