Visakhapatnam: పదో తరగతి ఫలితాల్లో విషాదం
ABN , First Publish Date - 2022-06-07T17:02:21+05:30 IST
పదో తరగతి ఫలితాల్లో విషాదం చోటు చేసుకుంది.
విశాఖపట్నం: పదో తరగతి ఫలితాల్లో విషాదం చోటు చేసుకుంది. పెందుర్తి మండలం అప్పన్నపాలెంకు చెందిన విద్యార్థి పదో తరగతి ఫెయిల్ అవడంతో మేఘాద్రి రిజర్వాయర్లో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. పదో తరగతిలో రెండు సబ్జెక్ట్లు పోయాయని తల్లి మందలించడంతో మనస్తాపం చెందిన విద్యార్థి సాయి(15) ఇంటి నుంచి వెళ్లిపోయి మేఘాద్రి రిజర్వాయర్లో దూకి బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈరోజు డ్యాంలో బయటకు తేలిన విద్యార్థి మృతదేహాన్ని పోలీసులు వెలికితీశారు. విద్యార్థి మృతితో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.