ఉద్యమ కార్యాచరణను ప్రకటించిన విశాఖ ఉక్కు పోరాట కమిటీ
ABN , First Publish Date - 2022-03-17T16:18:46+05:30 IST
విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యమం 400వ రోజుకు చేరుకుంటున్న నేపథ్యంలో విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ ఉద్యమ కార్యాచరణను ప్రకటించింది.
విశాఖపట్నం: విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యమం 400వ రోజుకు చేరుకుంటున్న నేపథ్యంలో విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ ఉద్యమ కార్యాచరణను ప్రకటించింది. పరిరక్షణ పోరాట కమిటీ నేతలు మీడియాతో మాట్లాడుతూ... ఈ నెల 28 తేదీన విశాఖ నగర బంద్కు పిలుపునిస్తున్నామని తెలిపారు. మరోసారి ఢిల్లీ వెళ్లి, బీజేపీ మినహా అన్ని పార్టీల ఎంపీలను కలవాలని నిర్ణయం తీసుకున్నామన్నారు. కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని మరింత ఉధృతం చేయాలని నిర్ణయించామని చెప్పారు. బంద్కు అన్ని వర్గాల ప్రజలు, రాజకీయ పార్టీలు మద్దతు ఇవ్వాలని పిలుపునిచ్చారు. ప్రైవేటీకరణపై కేంద్రం వెనక్కి తగ్గే వరకు తమ పోరాటం ఆగదని స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వం మొండిగా ముందుకు వెళ్తోందని.. స్టీల్ ప్లాంట్ పరిరక్షణకు సీఎం రంగంలోకి దిగాలని పోరాట కమిటీ నేతలు డిమాండ్ చేశారు.