Vijayawada: ఏలూరులో కారు బీభత్సం..ముగ్గురికి గాయాలు
ABN , First Publish Date - 2022-01-11T14:45:09+05:30 IST
ఏలూరులో కారు బీభత్సం సృష్టించింది. డివైడర్కు ఒకవైపు నుంచీ మరో డివైడర్ వైపు కారు దూసుకెళ్లింది. నడిరోడ్డుపై యువకులు ఓవర్ స్పీడ్తో మద్యం మత్తులో
విజయవాడ: ఏలూరులో కారు బీభత్సం సృష్టించింది. డివైడర్కు ఒకవైపు నుంచీ మరో డివైడర్ వైపు కారు దూసుకెళ్లింది. నడిరోడ్డుపై యువకులు ఓవర్ స్పీడ్తో మద్యం మత్తులో కారు నడపారు. బైక్లపై వెళ్తున్న ఇద్దరిని ఢీకొట్టుకుంటూ కారు దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానికులు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. ముగ్గురు యువకులను మాచవరం పోలీసులు అదుపులోకి తీసుకోగా మరో ఇద్దరు పరారైనట్లు పోలీసులు తెలిపారు.