పరభాష కళ్లద్దాల్లాంటిది: వెంకయ్య
ABN , First Publish Date - 2022-07-16T02:38:44+05:30 IST
చిన్ననాటి నుంచే మాతృభాష నేర్చుకోవాలని, మాతృభాష కంటిచూపు లాంటిదని, పరభాష కళ్లద్దాలాంటివని భారత ఉపరాష్ట్రపతి

విజయవాడ: చిన్ననాటి నుంచే మాతృభాష నేర్చుకోవాలని, మాతృభాష కంటిచూపు లాంటిదని, పరభాష కళ్లద్దాలాంటివని భారత ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్యనాయుడు అన్నారు. శుక్రవారం విజయవాడలోని మారిస్ స్టెల్లా కళాశాల డైమండ్ జూబ్లీ వేడుకల్లో ముఖ్యఅతిధిగా ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నూతన జాతీయ విద్యా విధానాన్ని అమలుపర్చడం అభినందనీయమన్నారు. విద్యార్ధులు ఇతర భాషలను నేర్చుకోవడం వల్ల వారి అభ్యున్నతికి దోహదపడుతోందన్నారు. మనమంతా భారతీయులమని, మన మతాన్ని ప్రేమించాలని, పరమతాన్ని గౌరవించాలని వెంకయ్యనాయుడు సూచించారు.