సీఎం జగన్కు టీడీపీ నేత వర్ల రామయ్య లేఖ
ABN , First Publish Date - 2022-05-01T19:53:11+05:30 IST
టీడీపీ నేత వర్ల రామయ్య సీఎం జగన్కు లేఖ రాశారు.

అమరావతి: తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత వర్ల రామయ్య ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి లేఖ రాశారు. పోలీస్ వ్యవస్థను అడ్డుపెట్టుకొని వైసీపీ నేతలు అరాచకాలకు పాల్పడుతున్నారని ఆ లేఖలో పేర్కొన్నారు. ఈ అరాచకాలపై సీఎం స్పందించకపోవడం బాధాకరమన్నారు. ఏపీలో పోలీస్ వ్యవస్థను నిర్వీర్యం చేశారని, దీనివల్ల రాష్ట్రంలో అశాంతి ప్రబలి అభివృద్ధి కుంటుపడిందని వర్ల రామయ్య పేర్కొన్నారు.