జగన్ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు చెప్పడం సిగ్గుచేటు: అనిత
ABN , First Publish Date - 2022-03-08T00:36:16+05:30 IST
జగన్ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు చెప్పడం సిగ్గుచేటు: అనిత
అమరావతి: సీఎం జగన్ పాలనలో ఆడబిడ్డలపై రోజుకో అఘాయిత్యం జరిగినందుకు గర్వంతో మహిళాసాధికారత జపం చేస్తున్నారా? అని టీడీపీ నేత వంగలపూడి అనిత ప్రశ్నించారు. తల్లికి, చెల్లికి, బాబాయ్ కూతురికి న్యాయంచేయలేని జగన్ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు చెప్పడం సిగ్గుచేటన్నారు. జీతాలు పెంచండి.. ఉద్యోగ భద్రత కల్పించండని అడిగిన అంగన్వాడీ, ఆశా సిబ్బందిని పోలీసులతో కొట్టించడమేనా మహిళాసాధికారత? అని ఆమె ప్రశ్నించారు. రాజధాని కోసం 810 రోజులుగా ఉద్యమం చేస్తున్న వారిని పోలీసుల బూటుకాళ్లతో తన్నించడమా? అని ప్రశ్నించారు.