తెలంగాణ ప్రభుత్వాన్ని ఆ కేసులో చేర్చాలి: ఉండవల్లి
ABN , First Publish Date - 2022-09-19T22:19:19+05:30 IST
తెలంగాణ ప్రభుత్వాన్ని ఆ కేసులో చేర్చాలి: ఉండవల్లి
ఢిల్లీ: మార్గదర్శి కేసులో సుప్రీంకోర్టులో 3 పిటిషన్లు దాఖలు చేశారు. సుప్రీంకోర్టులో ఏపీ ప్రభుత్వం, ఉండవల్లి, రామోజీరావు పిటిషన్లు దాఖలు చేశారు. మార్గదర్శి డిపాజిట్దారులందరికీ నగదు వాపసు చేశారా లేదా అని ఏపీ ప్రభుత్వాన్ని ధర్మాసనం ప్రశ్నించింది. సమాచారం కోసం కొంత సమయం కావాలని ఏపీ ప్రభుత్వం పేర్కొంది. తెలంగాణ ప్రభుత్వాన్ని కూడా మార్గదర్శి కేసులో చేర్చాలని ఉండవల్లి కోరారు. విచారణ నాలుగు వారాలకు కోర్టు వాయిదా వేసింది.