YCP ప్లీనరీ నేపథ్యంలో ట్రాఫిక్ ఆంక్షలు
ABN , First Publish Date - 2022-07-08T16:44:18+05:30 IST
వైసీపీ ప్లీనరీ సమావేశాల నేపథ్యంలో గుంటూరులో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.
అమరావతి: వైసీపీ ప్లీనరీ(YCP plenary)సమావేశాల నేపథ్యంలో గుంటూరులో పోలీసులు (Police)ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. దీంతో ఈ రోజు, రేపు విజయవాడ నుంచి గుంటూరు మీదగా వెళ్లే వాహనదారులు ట్రాఫిక్ కష్టాలు ఎదుర్కోవాల్సిందే. ఒక్కరోజే ట్రాఫిక్ డైవర్షన్ అంటూ ప్రకటన విడుదల చేసినప్పటికీ... ఈ రోజు నుంచే ట్రాఫిక్ కష్టాలు మొదలయ్యాయి. ఇడుపులపాయ నుంచి సీఎం రాక సందర్బంగా గన్నవరం నుంచి ప్లీనరీ జరిగే సభా ప్రాంగణం వరకూ ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. చెన్నై, కల్కత్తా వెళ్లే వాహనాలు నగరం వెలుపలే నుంచే హనుమాన్ జంక్షన్ వద్ద నుంచి మళ్లిస్తున్నారు.