తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ
ABN , First Publish Date - 2022-08-13T13:57:19+05:30 IST
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. నేడు వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోని కంపార్ట్మెంట్లన్నీ భక్తులతో నిండిపోయాయి.
తిరుమల : తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. నేడు వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోని కంపార్ట్మెంట్లన్నీ భక్తులతో నిండిపోయాయి. భక్తులు క్యూలైన్లలో వెలుపల సైతం వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 15 గంటల సమయం పడుతోంది. శుక్రవారం తిరుమల శ్రీవారిని 64,079 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.52 కోట్లు వచ్చినట్టు తిరుమల తిరుపతి దేవస్థానం వెల్లడించింది. నిన్న శ్రీవారికి 32,852 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు.