తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ

ABN , First Publish Date - 2022-07-18T14:08:22+05:30 IST

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. నేడు 31 కంపార్ట్‌మెంట్లలో భక్తులు స్వామివారి దర్శనం కోసం వేచి ఉన్నారు.

తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ

తిరుమల : తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. నేడు 31 కంపార్ట్‌మెంట్లలో భక్తులు స్వామివారి దర్శనం కోసం వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 9 గంటల సమయం పడుతోంది. ఆదివారం శ్రీవారిని 73,387 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ.4.68 కోట్లు వచ్చినట్టు తిరుమల తిరుపతి దేవస్థానం వెల్లడించింది. 33,965  మంది భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించారు. 

Updated Date - 2022-07-18T14:08:22+05:30 IST