తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ
ABN , First Publish Date - 2022-02-19T14:10:34+05:30 IST
తిరుమలలో భక్తుల రద్దీ క్రమక్రమంగా పెరగుతోంది. టీటీడీ గంటకు 1500 చొప్పున టికెట్లను మంజూరు చేస్తుండటంతో..
తిరుపతి : తిరుమలలో భక్తుల రద్దీ క్రమక్రమంగా పెరగుతోంది. టీటీడీ గంటకు 1500 చొప్పున టికెట్లను మంజూరు చేస్తుండటంతో భక్తులు పెద్ద సంఖ్యలో తిరుమలకు తరలి వస్తున్నారు. శుక్రవారం తిరుమల శ్రీవారిని 35,584 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ.2.85 కోట్లు వచ్చినట్టు తిరుమల తిరుపతి దేవస్థానం వెల్లడించింది. స్వామివారికి 18,608 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు.