తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ

ABN , First Publish Date - 2022-09-19T14:26:19+05:30 IST

తిరుమలలో రద్దీ కొనసాగుతోంది. 29 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి

తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ

తిరుమల : తిరుమలలో రద్దీ కొనసాగుతోంది. 29 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటల సమయం పడుతోంది. ఆదివారం తిరుమల శ్రీవారిని 88,924 మంది భక్తులు స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. శ్రీవారికి నిన్న 34,282 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.72 కోట్లు వచ్చినట్టు టీటీడీ వెల్లడించింది. రేపు శ్రీవారి ఆలయంలో కోయిల్‌ ఆళ్వాల్‌ తిరుమంజనం జరగనుంది. రేపు ఉదయం 11 గంటల వరకు శ్రీవారి దర్శనాలు రద్దయ్యాయి. 

Updated Date - 2022-09-19T14:26:19+05:30 IST