Tirumala: టీటీడీ చరిత్రలోనే అత్యధిక ఆదాయం

ABN , First Publish Date - 2022-08-01T02:59:05+05:30 IST

టీటీడీ (Ttd) చరిత్రలోనే జులై మాసంలో శ్రీవారికి భక్తులు అత్యధికంగా హుండీ కానుకలు సమర్పించారు. జులై మాసంలో ...

Tirumala: టీటీడీ చరిత్రలోనే అత్యధిక ఆదాయం

తిరుమల (Tirumala): టీటీడీ (Ttd) చరిత్రలోనే జులై మాసంలో శ్రీవారికి భక్తులు అత్యధికంగా హుండీ కానుకలు సమర్పించారు. హుండీ ద్వారా 139 కోట్ల 45 లక్షల రూపాయల ఆదాయం వచ్చింది. ఇప్పటివరకు మే మాసంలో 130 కోట్ల 5 లక్షల రూపాయలు అత్యధికంగా వచ్చింది. వరుసగా శ్రీవారి హుండీ ఆదాయం ఐదో నెల రూ. 100 కోట్ల మార్కుంది. జులై మాసంలో ఐదుసార్లు 5 కోట్ల మార్క్‌ని దాటింది. జూలై 4న స్వామి వారికి 6 కోట్ల 18 లక్షల రూపాయలు హుండీ ఆదాయం వచ్చింది. 


Updated Date - 2022-08-01T02:59:05+05:30 IST