Tirumala: శ్రీవారిని దర్శించుకున్న కర్ణాటక సీఎం
ABN , First Publish Date - 2022-08-20T01:44:33+05:30 IST
కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై (Basavaraj Bommai), మాజీ సీఎం యడియూరప్ప శుక్రవారం ఉదయం తిరుమల
తిరుమల: కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై (Basavaraj Bommai), మాజీ సీఎం యడియూరప్ప శుక్రవారం ఉదయం తిరుమల వేంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ బ్రేక్ సమయంలో ఆలయం వద్దకు చేరుకున్న వీరికి టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి (TTD Chairman YV Subbareddy), డిప్యూటీ సీఎం నారాయణస్వామి స్వాగతం పలికారు. ఆలయంలోకి వెళ్లిన వీరు ముందుగా ధ్వజస్తంభానికి మొక్కుకుని తర్వాత గర్భాలయంలోని మూలమూర్తిని దర్శించుకున్నారు. అనంతరం బసవరాజ్ బొమ్మైకు, యడియూరప్పకు రంగనాయక మండపంలో వేదపండితులు ఆశీర్వచనం చేయగా, టీటీడీ చైర్మన్, ఈవో ధర్మారెడ్డి లడ్డూప్రసాదాలు అందజేశారు. తర్వాత తిరుమలలోని శ్రీవారి ఆలయం వెనుకభాగంలో నిర్మాణంలో ఉన్న కర్ణాటక సత్రం భవనాన్ని బసవరాజ్ బొమ్మై, యడియూరప్ప పరిశీలించారు.