కోర్టులో చోరీ.. వైసీపీ నేత కేసులో కీలక పత్రాలుండే బ్యాగుల అపహరణ
ABN , First Publish Date - 2022-04-15T01:11:11+05:30 IST
కోర్టులో చోరీ.. వైసీపీ నేత కేసులో కీలక పత్రాలుండే బ్యాగుల అపహరణ
నెల్లూరు: జిల్లా కోర్టు సముదాయంలో 4వ అదనపు జడ్జి కోర్టులో చోరీ జరిగింది. వైసీపీ ప్రజాప్రతినిధి నిందితుడుగా ఉన్న కేసులో కీలక పత్రాలుండే బ్యాగులను దుండగులు అపహరించారు. లాప్టాప్, టాబ్, నాలుగు సెల్ఫోన్లను దుండగులు ఎత్తుకెళ్లి కాలువలో పడేశారు. కాలువలో వెదికి కీలక పత్రాలు, నకిలీ పాసుపోర్టులను పోలీసులు సేకరించారు. చిన్నబజారు పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు కోర్టు వర్గాలు పేర్కొన్నాయి.