ఆయువు తీసిన ఆన్లైన్ గేమ్!
ABN , First Publish Date - 2022-07-04T08:37:15+05:30 IST
ఆయువు తీసిన ఆన్లైన్ గేమ్!
నష్టాలపాలై సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఆత్మహత్య
జగ్గయ్యపేట రూరల్, జూలై 3: ఆన్లైన్ గేమ్లకు మరో సాఫ్ట్వేర్ ఇంజనీర్ బలైంది. ఆన్లైన్ గేమ్ల్లో భారీగా నష్టపోయిన ఓ యువతి చెరువులోకి దూకి బలవన్మరణానికి పాల్పడింది. ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట వద్ద చిల్లకల్లు చెరువులో ఆదివారం యువతి మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. పోలీసుల కథనం మేరకు... గుంటూరు జిల్లా మంగళగిరి మండలం నవులూరు గ్రామానికి చెందిన జాస్తి సోమశేఖర్ రెండో కుమార్తె స్వాతి బీటెక్ పూర్తిచేసి ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం చేస్తుంది. ప్రస్తుతం వర్క్ఫ్రం హోంలో ఉంది. ఇక అందరూ ఆఫీసుకు రావాలని కంపెనీ ఆదేశించడంతో సోమవారం హైదరాబాద్ వెళ్లేందుకు ఏర్పాట్లు చేసుకుంది. ఈ నేపథ్యంలో శనివారం సాయంత్రం ఇంటి నుంచి బయటకు వెళ్లిన స్వాతి.. రాత్రి ఏడు గంటల సమయంలో తాను చిల్లకల్లు చెరువు వద్ద ఉన్నానని, బాగా ఒత్తిడికి గురవడంతో ఆత్మహత్య చేసుకుంటున్నానని తల్లి ఫోన్కు వాట్సాప్ మెసేజ్ పెట్టింది. దీంతో కుటుంబసభ్యులు వెంటనే చిల్లకల్లు వచ్చి పోలీసులను ఆశ్రయించారు. చెరు వు వద్ద శనివారం అర్ధరాత్రి వరకు ఈతగాళ్లతో వెతికించినా స్వాతి కనిపించలేదు. ఆదివారం ఉదయాన్నే మరోసారి ప్రయత్నించగా స్వాతి మృతదేహం లభించింది. పోస్టుమార్టం నిమిత్తం జగ్గయ్యపేట ప్రభుత్వాస్పత్రికి తరలించి అనుమానాస్పద మృతిగా కేసు నమోదుచేశారు. కాగా ఇటీవల ఆన్లైన్ గేమ్లో భారీగా నష్టపోయిన ఆమె ఒత్తిడి తట్టుకోలేకే ఆత్మహత్మకు పాల్ప డి ఉంటుందని కుటుంబ సభ్యులు తెలిపారు.