Minister Botsa: ఉద్యోగుల సమస్యలపై చర్చలకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది.

ABN , First Publish Date - 2022-12-06T21:13:09+05:30 IST

Amaravathi: ఉద్యోగుల సమస్యలపై చర్చలకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని మంత్రి బొత్సా సత్యనారాయణ తెలిపారు. ఉద్యోగుల పెండింగ్ సమస్యలపై

Minister Botsa: ఉద్యోగుల సమస్యలపై చర్చలకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది.

Amaravathi: ఉద్యోగుల సమస్యలపై చర్చలకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని మంత్రి బొత్సా సత్యనారాయణ తెలిపారు. ఉద్యోగుల పెండింగ్ సమస్యలపై చర్చించామని, ఉద్యోగుల ప్రతి సమస్యను పరిష్కరించేందుకు ప్రభుత్వం చిత్త‌శుద్ధితో ఉందన్నారు. మంగళవారం ఉద్యోగ నంఘాల నాయకులతో మంత్రి బొత్స, సీఎస్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఏపీ జేఏసీ చైర్మన్ బొప్పరాజు మాట్లాడుతూ..‘‘సీపీఎస్ సమావేశం అని చెప్పడం‌తో రాకూడదు అనుకున్నాం. తరువాత ఉద్యోగుల అన్ని సమస్యలపై చర్చిద్దాం అని సమాచారం ఇచ్చారు. సమావేశంలో పే స్కేల్ వెంటనే అయా కార్యాలయాలకు పంపాలని కోరాం. మాకు అప్పుపడ్డ బకాయిలు చెల్లింపునకు రోడ్ మ్యాప్ ఇవ్వమని కోరాం. టైం లైన్ ఫిక్స్ చేయమని చెప్పాం. కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్దీకరణకు వచ్చే మీటింగ్‌లో సీఎం‌తో మాట్లాడి చర్చిద్దాం అన్నారు. ఎంప్లాయీస్ హెల్త్ స్కీం పైనా చర్చించాలని, అలాగే ఎన్జీవో సొసైటీ‌లకు ఇళ్ళ స్థలాలు ఇవ్వాలని కోరాం.’’ అని చెప్పారు.

Updated Date - 2022-12-06T21:13:10+05:30 IST