కదులుతున్న జగనన్న ఇళ్ల పునాదులు

ABN , First Publish Date - 2022-12-07T02:52:58+05:30 IST

విజయవాడ నగరానికి సమీపంలోని పాతపాడులో జగనన్న కాలనీ ఇళ్లకు పక్కనే బ్లాస్టింగ్‌ జరుగుతుండటంతో లబ్ధిదారులు గగ్గోలు పెడుతున్నారు.

కదులుతున్న జగనన్న ఇళ్ల పునాదులు

నిర్మాణంలోని ఇళ్ల చెంతనే బ్లాస్టింగ్‌లు

విజయవాడ రూరల్‌/పాయకాపురం, డిసెంబరు 6: విజయవాడ నగరానికి సమీపంలోని పాతపాడులో జగనన్న కాలనీ ఇళ్లకు పక్కనే బ్లాస్టింగ్‌ జరుగుతుండటంతో లబ్ధిదారులు గగ్గోలు పెడుతున్నారు. గ్రామ పరిధిలోని గుబ్బలగుట్ట కొండను ఆనుకుని సుమారు 60 ఇళ్లను ప్రభుత్వం నిర్మిస్తోంది. వీటిలో కొన్ని పునాది దశలో ఉండగా, మరికొన్ని శ్లాబ్‌ పూర్తి చేసుకున్నాయి. జగనన్న కాలనీల మెరకకు మట్టి కోసం గుబ్బలగుట్ట కొండ తవ్వకం పనులను ప్రభుత్వం స్థానిక వైసీపీ నేతకు అప్పగించింది. 20 రోజులుగా ఈ ప్రాంతంలో భారీ బ్లాస్టింగ్‌లు చేస్తున్నారు. పేలుళ్ల ధాటికి నిర్మాణంలో ఉన్న ఇళ్ల పునాదులు బీటలు వారుతున్నాయని లబ్ధిదారులు గగ్గోలు పెడుతున్నారు.

Updated Date - 2022-12-07T02:52:59+05:30 IST