విజయవాడకు టెక్‌ మహీంద్రా!

ABN , First Publish Date - 2022-03-01T02:03:00+05:30 IST

టెక్‌ మహీంద్రా విజయవాడలో తన యూనిట్‌ను ఏర్పాటు చేయబోతోందనే ప్రచారం జరుగుతోంది. కేసరపల్లిలోని ఏస్‌ అర్బన్‌-ఏపీఐఐసీ హైటెక్‌ సిటీలోని

విజయవాడకు టెక్‌ మహీంద్రా!

విజయవాడ: టెక్‌ మహీంద్రా విజయవాడలో తన యూనిట్‌ను ఏర్పాటు చేయబోతోందనే ప్రచారం జరుగుతోంది. కేసరపల్లిలోని ఏస్‌ అర్బన్‌-ఏపీఐఐసీ హైటెక్‌ సిటీలోని మేథ టవర్‌లో తన శాఖను త్వరలో ప్రారంభిచనుంది. విజయవాడ కేంద్రంగా కార్యకలాపాల కోసం మేథలో భారీ పరిమాణంలో స్పేస్‌ కావాలని టెక్‌ మహీంద్రా యాజమాన్యం కోరటం.. ఇటీవలే ఏస్‌ అర్బన్‌ సంస్థ అప్పగించటం జరిగిపోయింది. ఏస్‌ అర్బన్‌ సంస్థ దీనిపై అధికారికంగా ఇంకా ప్రకటించకపోయినప్పటికీ టెక్‌ మహీంద్రా ఇప్పటికే తనకు కేటాయించిన స్పేస్‌ను స్వాధీనంలోకి తీసుకుని ఇంటీరియర్‌ పనులు చేపడుతోంది. మేథ టవర్‌లో ఐటీ రిలేటెడ్‌ కంపెనీని ఏర్పాటు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. వారం రోజుల్లో అధికారికంగా టెక్‌ మహీంద్రా, ఏస్‌ అర్బన్‌ సంస్థలు దీనిపై ప్రకటన చేయనున్నాయి.

Updated Date - 2022-03-01T02:03:00+05:30 IST