ఉగాదికి ఇస్తామన్న ఇళ్లు ఏమయ్యాయి?: టీడీపీ

ABN , First Publish Date - 2022-02-23T08:43:39+05:30 IST

‘‘ఈ ఏడాది ఉగాది నాటికి రాష్ట్రంలో పేదలకు మూడున్నర లక్షల ఇళ్లు నిర్మించి, ప్రారంభిస్తామని జగన్‌ ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఆ హామీ ఏమైంది? కొత్తగా ఇళ్లు కట్టడం చేతగాకపోయినా గత ప్రభుత్వాలు

ఉగాదికి ఇస్తామన్న ఇళ్లు ఏమయ్యాయి?: టీడీపీ

అమరావతి, ఫిబ్రవరి 22(ఆంధ్రజ్యోతి): ‘‘ఈ ఏడాది ఉగాది నాటికి రాష్ట్రంలో పేదలకు మూడున్నర లక్షల ఇళ్లు నిర్మించి, ప్రారంభిస్తామని జగన్‌ ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఆ హామీ ఏమైంది? కొత్తగా ఇళ్లు కట్టడం చేతగాకపోయినా గత ప్రభుత్వాలు కట్టినఇళ్లకు ఓటీఎస్‌ పేరుతో డబ్బులు వసూలు చేయడం దారుణం’’ అని తెలుగుదేశం పార్టీ విమర్శించింది. ఆ పార్టీ మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులు మంగళవారం ఇక్కడ విలేకరులతో మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో వెల్లడించిన సమాచారం ప్రకారం.. 2019-20 సంవత్సరంలో ఐదు ఇళ్లు మాత్రమే పూర్తి చేశారు. 2020-21 సంవత్సరంలో ఒక్కటి కూడా కట్టలేదని అన్నారు. ఇళ్ల స్థలాల పేరుతో రాష్ట్రవ్యాప్తంగా రూ.4,500 కోట్లు మింగేశారన్నారు. 

Updated Date - 2022-02-23T08:43:39+05:30 IST