వైసీపీ ప్రభుత్వానికి టీడీపీ అంటే భయం: యనమల
ABN , First Publish Date - 2022-03-06T01:37:00+05:30 IST
వైసీపీ ప్రభుత్వానికి టీడీపీ అంటే భయం పట్టుకుందని మాజీమంత్రి యనమల రామకృష్ణుడు ఎద్దేవాచేశారు.
అమరావతి: వైసీపీ ప్రభుత్వానికి టీడీపీ అంటే భయం పట్టుకుందని మాజీమంత్రి యనమల రామకృష్ణుడు ఎద్దేవాచేశారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ అధికార పక్షం చేసే తప్పులను ఎండగడతారనే.. ప్రతిపక్షాలకు అసెంబ్లీలో వాయిస్ లేకుండా చేస్తున్నారని మండిపడ్డారు. రాజ్యాంగ వ్యతిరేక పనులకు జగన్రెడ్డి ప్రభుత్వం పూనుకుందని దుయ్యబట్టారు. ప్రజాసమస్యలపై చర్చించకుండా ప్రతిపక్షాల నోరు నొక్కుతున్నారని మండిపడ్డారు. రాజ్యాంగ, నైతిక విలువలు లేకుండా 3 రాజధానుల చట్టం తీసుకురావడం సరికాదని యనమల రామకృష్ణుడు తప్పుబట్టారు.