పార్టీలో తన తల్లి అడ్డును జగన్ తొలగించుకున్నారు: Anitha
ABN , First Publish Date - 2022-07-08T20:47:39+05:30 IST
విజయలక్ష్మి ఎప్పుడూ వైసీపీ పార్టీలో కీలక పాత్ర పోషించలేదని టీడీపీ నేత వంగలపూడి అనిత అన్నారు.
అమరావతి: విజయలక్ష్మి(Vijayalaxmi) ఎప్పుడూ వైసీపీ(YCP) పార్టీలో కీలక పాత్ర పోషించలేదని టీడీపీ(TDP) నేత వంగలపూడి అనిత (Vangalapudi anitha) అన్నారు. వైసీపీకి విజయలక్ష్మి రాజీనామాపై ఏబీఎన్తో మాట్లాడుతూ.. రాజీనామా చేశానని చెప్పడానికే విజయమ్మ ప్లీనరీకి వచ్చారని తెలిపారు. పార్టీ సమావేశాల్లోనూ ఆమె ఎప్పుడూ పాల్గొనలేదన్నారు. పార్టీలో తన తల్లి అడ్డును జగన్ తొలగించుకున్నారని విమర్శించారు. అవసరం తీరగానే.. తల్లిని, చెల్లిని జగన్ పార్టీకి దూరం పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. విజయలక్ష్మి రాజీనామాను ఓ డ్రామాగా ప్లాన్ చేశారన్నారు. విజయలక్ష్మి రాజీనామా కోసమే.. వైసీపీ ప్లీనరీని ఉపయోగించుకున్నారని అన్నారు. విజయలక్ష్మిని పార్టీ నుంచి తప్పించడానికి చేసిన ప్లీనరీ ఇది అని వ్యాఖ్యలు చేశారు. సీఎం కుర్చీలో కూర్చోడానికి జగన్ ఏమైనా చేస్తారని వంగలపూడి అనిత అన్నారు.