AP news: ఆదివాసీల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలి: లోకేష్
ABN , First Publish Date - 2022-08-09T17:06:24+05:30 IST
అడవి తల్లిని ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించే ఆదివాసీలకు టీడీపీ జాతీయ ప్రధానకార్యదర్శి నారా లోకేష్ ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేశారు.
అమరావతి: అడవి తల్లిని ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించే ఆదివాసీలకు టీడీపీ జాతీయ ప్రధానకార్యదర్శి నారా లోకేష్ (Lokesh) ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేశారు. పోలవరం ప్యాకేజి (Polavaram Package) దగ్గర నుండి ఎన్నో ఏళ్లుగా గిరిజనానికి హక్కుగా వస్తున్న అనేక సంక్షేమ కార్యక్రమాలు రద్దు చేయడం వరకూ జగన్ రెడ్డి (Jagan reddy) వారిని నమ్మించి వంచించారని మండిపడ్డారు. మాటలతో కోటలు కట్టడం మాని వైసీపీ ప్రభుత్వం (YCP Government) చిత్తశుద్దిగా ఆదివాసీల సమస్యల పరిష్కారం కోసం కృషి చేయాలని డిమాండ్ చేశారు. ఇచ్చిన హామీలన్నీ అమలు చేయాలని లోకేష్ అన్నారు.