ఇప్పుడే ఎన్నికలు పెట్టి గెలవాలి.. వైసీపీ నేతలకు దేవినేని ఉమా సవాల్
ABN , First Publish Date - 2022-07-11T01:42:04+05:30 IST
వాలంటీర్లను, డ్వాక్రా మహిళలను ఒత్తిడి చేసి వైసీపీ ప్లీనరీకి తరలించారని టీడీపీ మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు...
ఎన్టీఆర్ (Ntr District): వాలంటీర్లను, డ్వాక్రా మహిళలను ఒత్తిడి చేసి వైసీపీ ప్లీనరీకి తరలించారని టీడీపీ మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు (Tdp Ex Mla devineni Uma) అన్నారు. ఆర్టీసీ బస్సులకు ఎటువంటి రుసుము చెల్లించకుండా సొంత వాహనాలుగా వాడుకున్నారని ఆయన మండిపడ్డారు. ఆర్టీసీ ఎండీ, చైర్మన్లు ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. 175 స్థానాలు వస్తాయని కలలు కంటున్నారని.. ఇప్పుడే ఎన్నికలు పెట్టి గెలవాలని దేవినేని సవాల్ విసిరారు. సీఎం జగన్ (Cm jagan), సజ్జల, వైవీ సుబ్బారెడ్డి (Yv Subba Reddy), విజయసాయిరెడ్డి (Vijayasaireddy) దుష్టచతుష్టయం రాష్ట్రాన్ని దోచుకుంటోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. శ్రీలంక (Srilanka)లో పారిపోవడానికి షిప్ ఉందని.. తాడేపల్లిలో హెలికాప్టర్ ఉందని ఎద్దేవా చేశారు. బాబాయి హత్యను కప్పి పుచ్చుకోవడానికే రాష్ట్రపతి ఎన్నికల్లో బీజేపీకి మద్దతు ఇస్తున్నారని విమర్శించారు. ఐదేళ్ళ పాటు మంత్రి పదవి నిలబెట్టుకోలేని కొడాలికి చంద్రబాబును విమర్శించే స్థాయి ఉందా? అని ప్రశ్నించారు. కాసినోలు, క్యాబరే డాన్సులు టీడీపీ హయాంలో పెట్టలేదని దేవినేని ఉమా పేర్కొన్నారు.