ఏపీలో మద్యం షాపులన్నీ జే బ్రాండ్తో నిండిపోయాయి: Devathoti
ABN , First Publish Date - 2022-03-19T15:03:59+05:30 IST
ఏపీలో మద్యం షాపులన్నీ జే బ్రాండ్తో నిండిపోయాయని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి దేవతోటి నాగరాజు వ్యాఖ్యానించారు.
అమరావతి: ఏపీలో మద్యం షాపులన్నీ జే బ్రాండ్తో నిండిపోయాయని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి దేవతోటి నాగరాజు వ్యాఖ్యానించారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ... నాసిరకం మద్యాన్ని అధిక ధరలకు అమ్ముతూ పేద వారి నిండు నూరేళ్ళ ప్రాణాలను 30, 40 ఏళ్లకే చనిపోయేలా చేస్తున్నారని మండిపడ్డారు. ఏ రాష్ట్రంలోలేని ప్రాణాంతక మద్యం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాత్రమే దాపురించిందన్నారు. కల్తీ మద్యం తాగలేక పక్క రాష్ట్రాల సరుకును వైసీపీ నాయకుల బ్లాక్ మార్కెట్లో అధిక ధరలకు కొనలేక.. గంజాయి లాంటి ఇతర అలవాట్లతో జీవితాలను నాశనం చేసుకుంటున్నారని ఆయన తెలిపారు.
రాష్ట్రంలో జే బ్రాండ్ మద్యం ఆగిపోతే గాని కల్తీ మద్యం చావులు ఆగవని అన్నారు. రాష్ట్రంలో అరాచక పాలన కొనసాగుతోందని తెలిపారు. పేదోళ్ల ప్రాణాలకు విలువలేదని, మహిళల గౌరవానికి స్థానం లేదని చెప్పారు. ప్రభుత్వ ఉద్యోగులను గుర్తించడం లేదన్నారు. రాష్ట్రంలోని ప్రతీ పౌరుడు ఆత్మగౌరవంతో బతకాలంటే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావాలని దేవతోటి నాగరాజు పేర్కొన్నారు.