వివేకా హత్య గురించి సీఎంకు తెలుసు: buddha venkanna
ABN , First Publish Date - 2022-06-11T19:13:41+05:30 IST
మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య గురించి సీఎం జగన్కు తెలుసని టీడీపీ నేత బుద్దా వెంకన్న అన్నారు.
విశాఖపట్నం: మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య గురించి సీఎం జగన్కు తెలుసని టీడీపీ నేత బుద్ధా వెంకన్న అన్నారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ.. బాబాయ్ హత్యపై జగన్ ఎందుకు మాట్లాడడం లేదని ప్రశ్నించారు. నిందితులను ఎందుకు కాపాడుతున్నారని నిలదీశారు. హత్య కేసు నిందితులంతా అనుమానాస్పదంగా చనిపోన్నారని తెలిపారు. గంగాధర్రెడ్డి మృతివెనుక ఉన్న మిస్టరీ ఏంటి అని అడిగారు. గంగాధర్ రెడ్డి మరణంపై కూడా సీబీఐ విచారణ జరగాలని డిమాండ్ చేశారు. వైఎస్ సునీతా రెడ్డి, అతని భర్తకు రక్షణ కల్పించాలన్నారు. జగన్ ప్రభుత్వంపై ప్రజల్లో సహనం పెరిగిపోతోందని బుద్ధా వెంకన్న వ్యాఖ్యానించారు.