Buddavenkanna comments: విజయసాయిరెడ్డి ట్వీట్లు చూసి అసహించుకుంటున్నారు

ABN , First Publish Date - 2022-08-08T17:33:11+05:30 IST

వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ట్వీట్లు చూసి అందరూ అసహించుకుంటున్నారని టీడీపీ నేత బుద్దా వెంకన్న అన్నారు.

Buddavenkanna comments: విజయసాయిరెడ్డి ట్వీట్లు చూసి అసహించుకుంటున్నారు

విజయవాడ: వైసీపీ ఎంపీ (YCP MP) విజయసాయిరెడ్డి ((Vijayasaireddy) ట్వీట్లు చూసి అందరూ అసహించుకుంటున్నారని టీడీపీ (TDP) నేత బుద్దా వెంకన్న (Budda venkanna) అన్నారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. జైల్‌లో చిప్పకూడు తిన్న వ్యక్తికి రాజ్యసభ స్పీకర్‌ చైర్‌లో కూర్చునే అర్హత లేదన్నారు. వైసీపీలో పదవులు రావాలంటే కేసులే క్వాలిఫికేషన్ అని వ్యాఖ్యలు చేశారు. ఎన్టీఆర్ కుమార్తె మరణాన్ని కూడా మీ నీచ రాజకీయాలకు వాడతారా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. తప్పుడు సర్వేలతో మళ్లీ ప్రజలను మోసం చేయాలని చూస్తున్నారన్నారు. విజయసాయిరెడ్డి తీరు మార్చుకోకపోతే బుద్ధి చెప్పి తీరుతామని బుద్దా వెంకన్న హెచ్చరించారు. 

Updated Date - 2022-08-08T17:33:11+05:30 IST