AP News: సభ్యసమాజం తలదించుకునేలా వైసీపీ నేతలు తీరు: బోండా ఉమా
ABN , First Publish Date - 2022-08-04T19:13:15+05:30 IST
వైసీపీ నేతలు (YCP Leader) తీరును ప్రజలు అసహ్యంచుకుంటున్నారని టీడీపీ నేత బోండా ఉమా (Bonda uma) అన్నారు.
విజయవాడ: వైసీపీ నేతలు (YCP Leader) తీరును ప్రజలు అసహ్యంచుకుంటున్నారని టీడీపీ(TDP) నేత బోండా ఉమా (Bonda uma) అన్నారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ... సభ్యసమాజం తలదించుకునేలా వైసీపీ నేతల తీరు ఉందన్నారు. అడ్డంగా దొరికినా ఇంకా గోరంట్ల మాధవ్ (Gorantla madhav) బుకాయిస్తున్నారని మండిపడ్డారు. గోరంట్ల మాధవ్పై చర్యలు తీసుకోవాలని విజయసాయి ట్వీట్ చేయాలని అన్నారు. ఎంపీ గోరంట్లపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మంత్రి జోగి రమేశ్ మహిళా వాలంటీర్లను లైంగికంగా వేధిస్తున్నారని బొండా ఉమ తెలిపారు.