ఒక్క ఛాన్స్తో తెచ్చుకున్నందుకు ఈ ఖర్మ పట్టింది: Ayyanna
ABN , First Publish Date - 2022-02-25T16:29:06+05:30 IST
ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి, వైసీపీ ప్రభుత్వంపై మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత అయ్యన్నపాత్రుడు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
అమరావతి: ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి, వైసీపీ ప్రభుత్వంపై మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత అయ్యన్నపాత్రుడు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ... ‘‘అ.. ఆలు దిద్దించే అయ్యవార్లని బ్రాందీ షాపులకు కాపలా పెట్టిన ముఖ్యమంత్రి సారు... మండల పరిపాలన చూసే రెవెన్యూ సిబ్బందిని సినిమా హాళ్లకి గేటుమేన్లను చేశారు. ఒక్క చాన్స్తో తెచ్చుకుని దరిద్రాన్ని నెత్తికెత్తుకున్న పాపానికి ఈ ఖర్మ పట్టింది’’ అంటూ అయ్యన్న ట్వీట్ చేశారు.