నందిగామలో హీట్ పుట్టిస్తున్న రాజకీయాలు
ABN , First Publish Date - 2022-07-16T20:30:04+05:30 IST
జిల్లాలోని నందిగామలో రాజకీయాలు హీట్ పుట్టిస్తున్నాయి. నందిగామ గాంధీ సెంటర్ అన్నా క్యాంటీన్ను టీడీపీ ఏర్పాటు చేసింది. అన్నా క్యాంటీన్ ఏర్పాటుతో ట్రాఫిక్కు అంతరాయం కలుగుతుందని మున్సిపల్ అధికారులు,...
ఎన్టీఆర్: జిల్లాలోని నందిగామలో రాజకీయాలు హీట్ పుట్టిస్తున్నాయి. నందిగామ గాంధీ సెంటర్ అన్నా క్యాంటీన్ను టీడీపీ ఏర్పాటు చేసింది. అన్నా క్యాంటీన్ ఏర్పాటుతో ట్రాఫిక్కు అంతరాయం కలుగుతుందని మున్సిపల్ అధికారులు, పోలీసుల అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో టీడీపీ మాజీ ఎమ్మెల్యే సౌమ్య, మున్సిపల్ అధికారుల మధ్య వాగ్వివాదం చోటుచేసుకుంది. రేపటి నుంచి అన్నా క్యాంటీన్ ఏర్పాటు ప్రయివేటు స్థలాల్లో ఏర్పాటు చేసుకోవాలని పోలీసుల సూచించారు. అన్నా క్యాంటీన్పై కూడా వైసీపీ నీచ రాజకీయాలు చేస్తుందని సౌమ్య మండిపడ్డారు. ఎన్ని అడ్డంకులు సృష్టించినా అన్నా క్యాంటీన్ను ఆపే ప్రసక్తే లేదని ఆమె స్పష్టం చేశారు. టీడీపీ స్వచ్చందంగా ఏర్పాటు చేస్తే పార్టీకి పేరు వస్తుందనే నీచ రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు. పేదవాడి అన్నం పెట్టలేని వైసీపీ పోలీసులను పంపించి ఆపాలని చూస్తుందన్నారు. ప్రజలతో కలిసి అన్నా క్యాంటీన్లో మాజీ ఎమ్మెల్యే సౌమ్య భోజనం చేశారు.