బీజేపీ నేతలు కేంద్రం నుంచి డబ్బులు పట్టుకునిరండి: తమ్మినేని సీతారాం
ABN , First Publish Date - 2022-04-08T21:41:11+05:30 IST
ప్రాజెక్టుల విషయంలో తమపై విమర్శలు చేస్తే చూస్తు ఊరుకోమని స్పీకర్ తమ్మినేని సీతారాం అన్నారు.
శ్రీకాకుళం: ప్రాజెక్టుల విషయంలో తమపై విమర్శలు చేస్తే చూస్తు ఊరుకోమని స్పీకర్ తమ్మినేని సీతారాం అన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రాజెక్టుల విషయంలో బీజేపీ నేతలు ఆత్మపరిశీలన చేసుకోవాలని హితవు పలికారు. బీజేపీ నేతలు కబుర్లు చెప్పడం కాదు.. కేంద్రం నుంచి రాష్ట్ర అభివృద్ధికి డబ్బులు పట్టుకునిరావాలని సూచించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ అమ్మడం ఆపమానాలని ఏపీ బీజేపీ నేతలు సమస్యను కేంద్రానికి విన్నవించాలన్నారు. పోలవరం, ప్రత్యేక హోదా, రైల్వే జోన్పై ఏపీ బీజేపీ నేతలు కేంద్రంతో మాట్లాడాలని తమ్మినేని సీతారాం వ్యాఖ్యానించారు.