పలు జిల్లాల్లో ABN ఆంధ్రజ్యోతి ప్రసారాల నిలిపివేత

ABN , First Publish Date - 2022-02-03T20:42:13+05:30 IST

ఉద్యోగుల చలో విజయవాడ నేపథ్యంలో పలు జిల్లాల్లో ఏబీఎన్

పలు జిల్లాల్లో ABN ఆంధ్రజ్యోతి ప్రసారాల నిలిపివేత

విజయవాడ: ఉద్యోగుల చలో విజయవాడ నేపథ్యంలో పలు జిల్లాల్లో ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ప్రసారాలను నిలిపివేశారు. మధ్యాహ్నం తర్వాత పునరుద్ధరించారు. ఏపీలో పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాను అధికారులు నిలిపివేశారు. ఉ.9 గంటల నుంచి మ.2:30 వరకు విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది. విజయవాడలో ఉద్యోగులు కదం తొక్కిన దృశ్యాలను ప్రజలు చూడకుండా అడ్డుకునేందుకు ప్రభుత్వ ప్రయత్నాలు చేసింది. కృష్ణా జిల్లా జగ్గయ్యపేటలో ఉ.8 నుంచి మ.2 వరకు విద్యుత్‌ నిలిపివేశారు. దీంతో సెల్‌ఫోన్‌లో ABN యూట్యూబ్‌కి నెటిజన్లు, ఉద్యోగులు కనెక్ట్‌ అయ్యారు. చలో విజయవాడతో ప్రభుత్వ పతనం ప్రారంభమైందని ఉద్యోగులు మండిపడ్డారు. బీఆర్‌టీఎస్‌ రోడ్‌ ర్యాలీలో సజ్జలపై ఉద్యోగులు మండిపడ్డారు. హూ ఈజ్‌ సజ్జల అంటూ ఉద్యోగులు నినాదాలు చేశారు. 

Updated Date - 2022-02-03T20:42:13+05:30 IST