AP News: నన్నయ వర్సిటీ దగ్గర విద్యార్థుల ఆందోళన
ABN , First Publish Date - 2022-07-25T20:41:10+05:30 IST
నన్నయ వర్సిటీ దగ్గర విద్యార్థులు ఆందోళనకు దిగారు. హాస్టల్లోని సమస్యలు పరిష్కరించాలంటూ డిమాండ్ చేశారు.
రాజమండ్రి: నన్నయ వర్సిటీ(Nannaya University) దగ్గర విద్యార్థులు ఆందోళనకు దిగారు. హాస్టల్లోని సమస్యలు పరిష్కరించాలంటూ డిమాండ్ చేశారు. యూనివర్సిటీ గేట్లకు తాళాలు వేసి విద్యార్థులు(Students) నిరసన చేపట్టారు. గేట్లకు తాళయం వేయడంతో అధ్యపకులు, సిబ్బంది.. గేటు బయటే వేచి ఉన్నారు. నన్నయ వర్సిటీ దగ్గర భారీగా పోలీసులు మోహరించారు. చివరకు విద్యార్థులతో వర్సిటీ అధికారుల బృందం చర్చలు చేపట్టింది.