AP News: తుఫాను సమాచారం

ABN , First Publish Date - 2022-12-09T20:57:46+05:30 IST

Vishakapatnam: మాండస్ తుఫాను ప్రస్తుతం ఉత్తర వాయువ్య దిశగా పయనిస్తోంది. చెన్నైకి దక్షిణ ఆగ్నేయంగా 170 కిలోమీటర్ల దూరంలో, మహాబలిపురానికి ఆగ్నేయంగా 135 కిలోమీటర్లు దూరంలో కేంద్రీకృతమై ఉంది. ఈరోజు రాత్రి లేదా

AP News: తుఫాను సమాచారం

Vishakapatnam: మాండస్ తుఫాను ప్రస్తుతం ఉత్తర వాయువ్య దిశగా పయనిస్తోంది. చెన్నైకి దక్షిణ ఆగ్నేయంగా 170 కిలోమీటర్ల దూరంలో, మహాబలిపురానికి ఆగ్నేయంగా 135 కిలోమీటర్లు దూరంలో కేంద్రీకృతమై ఉంది. ఈరోజు రాత్రి లేదా తెల్లవారుజామున మహాబలిపురం సమీపంలో తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో తమిళనాడు, రాయలసీమ, దక్షిణ కోస్తా జిల్లాల్లో, పలుచోట్ల భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. అలాగే నెల్లూరు, తిరుపతి, అన్నమయ్య చిత్తూరు జిల్లాలకు ఆరంజ్ వార్నింగ్, చెన్నై కృష్ణపట్నం పోర్టులకు నాలుగో నెంబర్, మచిలీపట్నం నిజాంపట్నం ఓడరేవు పోర్టులకు మూడో నెంబర్, విశాఖపట్నం పోర్టుకు రెండో నెంబర్ హెచ్చరిక జారీ చేశారు. మత్స్యకారులు వేటకు వెళ్ళకూడదని సూచించింది.

Updated Date - 2022-12-09T20:57:47+05:30 IST