5 నుంచి అమరావతిలో శ్రీవారి ఆలయ మహాసంప్రోక్షణ

ABN , First Publish Date - 2022-05-30T09:01:01+05:30 IST

అమరావతిలో టీటీడీ నిర్మించిన శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయ మహాసంప్రోక్షణ కార్యక్రమాలు జూన్‌ ఐదు నుంచి తొమ్మిదో తేదీ వరకు జరగనున్నాయి.

5 నుంచి అమరావతిలో శ్రీవారి ఆలయ మహాసంప్రోక్షణ

తిరుమల, మే 29 (ఆంధ్రజ్యోతి): అమరావతిలో టీటీడీ నిర్మించిన శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయ మహాసంప్రోక్షణ కార్యక్రమాలు జూన్‌ ఐదు నుంచి తొమ్మిదో తేదీ వరకు జరగనున్నాయి. 4వ తేదీ సాయంత్రం అంకుర్పాణ నిర్వహిస్తారు. 5, 6, 7, 8 తేదీల్లో పలు కార్యక్రమాల అనంతరం చివరిరోజైన తొమ్మిదో తేదీన ఉదయం 4.30 నుంచి ఏడు గంటల వరకు కుంభారాధన, నివేదన, హోమం, మహాపూర్ణాహుతి, విమాన గోపుర కలశ ఆవాహన, ఉదయం 7.30 నుంచి 8.30 గంటల వరకు మిఽథున లగ్నంలో ప్రాణప్రతిష్ఠ, మహాసంప్రోక్షణ నిర్వహిస్తారు. ధ్వజారోహణం తర్వాత భక్తులను దర్శనానికి అనుమతిస్తారు. మధ్యాహ్నం శాంతి కల్యాణోత్సవం జరగనుంది. తర్వాత ధ్వజావరోహణం చేపడతారు.

Updated Date - 2022-05-30T09:01:01+05:30 IST