తిరుమలలో కల్యాణ మండపాల అడ్వాన్స్ బుకింగ్కు బ్రేక్
ABN , First Publish Date - 2022-12-21T03:40:55+05:30 IST
టీటీడీ ఆధ్వర్యంలో తిరుమలలో నిర్వహిస్తున్న కల్యాణ మండపాల అడ్వాన్స్ బుకింగ్ను టీటీడీ తాత్కాలికంగా నిలిపివేయనుంది.
మార్చి1 నుంచి తాత్కాలికంగా నిలిపివేయనున్న టీటీడీ
టీటీడీ ఆధ్వర్యంలో తిరుమలలో నిర్వహిస్తున్న కల్యాణ మండపాల అడ్వాన్స్ బుకింగ్ను టీటీడీ తాత్కాలికంగా నిలిపివేయనుంది. కొండపై ఉన్న ఏడు కల్యాణ మండపాలు నిర్మించి చాలా ఏళ్లు గడిచిన క్రమంలో మరమ్మతులు అవసరమయ్యాయి. ఈ పనులు చేపట్టాలని నిర్ణయించిన టీటీడీ మార్చి 1వ తేదీ నుంచి అడ్వాన్స్ బుకింగ్ను తాత్కాలికంగా నిలిపివేయనున్నట్టు ప్రకటించింది.